అల్లు అర్జున్ కి కేరళ ప్రభుత్వం నుండి ఆహ్వానం!
- ఈనెల 10న కేరళలో నెహ్రు ట్రోఫీ బోట్ రేస్ క్రీడలు
- పున్నమడ సరస్సులో జరగనున్న క్రీడలు
- బన్నీకి మలయాళంలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్
టాలీవుడ్ స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కి కేరళ ప్రభుత్వం నుండి ఆహ్వానం లభించింది. ఈనెల 10న కేరళలోని అలప్పూజా సమీపంలో గల పున్నమడ సరస్సులో నెహ్రు ట్రోఫీ బోట్ రేస్ క్రీడలు జరగనున్నాయి. అల్లు అర్జున్ కి తెలుగుతో పాటు మలయాళంలో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ నేపధ్యంలో బోట్ రేస్ క్రీడలకు గౌరవ అతిథిగా రావాలని కేరళ ప్రభుత్వం ఆహ్వానం పంపింది.