ఎన్ని వేలైనా అంతే... ఇలా డబ్బులు పడగానే అలా అమ్మాయిలకు ఖర్చు చేసే శ్రీనివాస్!

  • విచారణలో వెల్లడవుతున్న ఆసక్తికర అంశాలు
  • శ్రీనివాస్ ఖాతాల్లోకి వచ్చి పడే వేలు
  • ఎవరు, ఎందుకు వేశారన్న కోణంలో విచారణ
విశాఖ ఎయిర్ పోర్టులో వైఎస్ జగన్ పై దాడి చేసిన శ్రీనివాసరావు గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మూడు బ్యాంకు ఖాతాలను నడుపుతున్న శ్రీనివాస్ ఖాతాలో వేల కొద్దీ డబ్బులు వచ్చి పడేవని, వాటిని వెంటనే విత్ డ్రా చేసే శ్రీనివాస్, వాటిని జల్సాలకు, అమ్మాయిలకు ఖర్చు చేసేవాడని, స్నేహితులకు పార్టీలు ఇచ్చేవాడని సిట్ గుర్తించింది. అతని ఖాతాల్లో వేలకు వేలు ఎవరు వేశారు? ఎందుకు వేశారు? అన్న కోణంలో ఇప్పుడు దర్యాఫ్తు సాగుతోంది.

మూడు నెలల క్రితం ఒక్క లావాదేవీతో రూ. 40 వేలు శ్రీనివాస్ ఎస్బీఐ ఖాతాలోకి రాగా, ఆపై రెండు రోజుల్లోనే డబ్బంతా ఖర్చు చేసేశాడు శ్రీనివాస్. మరోసారి రూ. 30 వేలు పడగా, దాన్ని ఒక్క రోజులో 'ఉఫ్'మనిపించేశాడు. ఈ డబ్బును అమ్మాయిలతో పార్టీలకు, వారికి గిఫ్ట్ లు కొనిచ్చేందుకు, ఊరిలోని స్నేహితులకు మందు పార్టీ ఇచ్చేందుకు ఖర్చు చేశాడని సిట్ అధికార వర్గాలు వెల్లడించాయి.

శ్రీనివాస్ ఖాతాకు అతను పనిచేసే క్యాంటీన్ యజమాని హర్ష రూ. 40 వేలు బట్వాడా చేసినట్టు గుర్తించిన సిట్, ఈ విషయంలో హర్షను కూడా విచారించింది. నిన్న రాత్రి 2 గంటల వరకూ ఈ విచారణ కొనసాగినట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Vizag
Jagan
Srinivasa Rao
Bank Accounts
Luxary

More Telugu News