ప్రగతిభవన్ ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం వార్త కలకలం!

  • ‘ఉస్మానియా’లో వైద్యం సరిగా అందని వ్యక్తి
  • కేసీఆర్ కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వైనం
  • ఆత్మహత్యకు యత్నించాడని పొరపడ్డ పోలీసులు 
  • గాంధీ ఆసుపత్రికి తరలింపు
హైదరాబాద్ లోని ప్రగతి భవన్ ఎదుట ఓ వ్యక్తి కాలిన గాయాలతో ఉండటంతో చూసిన పోలీసులు, అతను ఆత్మహత్యాయత్నం చేశాడని భావించారు. వెంటనే, చికిత్స నిమిత్తం అతన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆ వ్యక్తి చెప్పిన విషయం విని, అందరూ ఆశ్చర్యపోయారు.

చాదర్ ఘాట్ లో జరిగిన ఓ ప్రమాదంలో గాయపడ్డ తనకు ఉస్మానియా ఆసుపత్రి వైద్య సిబ్బంది సరిగా వైద్యం అందించకపోగా తనపై దాడికి పాల్పడ్డారని, ఈ విషయమై సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు చేసేందుకు తాను ప్రగతిభవన్ కు వెళ్లానని చెప్పాడు. తాను ఆత్మహత్యకు పాల్పడలేదని, తన గాయాలు చూసి పొరపడ్డ పోలీసులు, తనను ఆసుపత్రికి తరలించారని అన్నాడు.
Go Back to Shorts
pragathi bhavan
kcr

More Telugu News