కాకినాడ నుంచి బయల్దేరిన హరికృష్ణ కుమార్తె సుహాసిని
- హరికృష్ణ ఏకైక కుమార్తె సుహాసిని
- తండ్రి మరణవార్తను తట్టుకోలేక పోతున్న కుమార్తె
- కుటుంబంతో కలసి హైదరాబాద్ పయనం
తండ్రి మరణవార్తతో నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని కన్నీటి పర్యంతం అయ్యారు. ఆమెను సముదాయించడం ఎవరి వల్ల కావడం లేదు. కాకినాడలో ఉన్న ఆమె, తన కుటుంబంతో కలసి హైదరాబాద్ బయల్దేరారు. హరికృష్ణకు ఏకైక కుమార్తె సుహాసిని. మరోవైపు ఆయన కుమారులు కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ హుటాహుటిన నార్కట్ పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలివెళ్లారు. తండ్రి మృత దేహాన్ని చూసి బోరున విలపించారు.