కేరళకు విరాళంగా రూ.10 లక్షల ప్రకటించిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్

  • మన భూతల స్వర్గం ఎనభై శాతం మునిగిపోయింది
  • ఈ దృశ్యాలను టీవీలో చూస్తుంటే చాలా బాధగా ఉంది
  • ఓ ప్రకటనలో ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా
కేరళ బాధితులకు టాలీవుడ్ కు చెందిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేన్ (మా) రూ.10 లక్షలు విరాళంగా ప్రకటించింది. ఈ మేరకు ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా ఓ ప్రకటన చేశారు. మన భూతల స్వర్గం ఎనభై శాతం మునిగిపోయిందని, ఈ దృశ్యాలను టీవీలో చూస్తుంటే చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మా’ తరపున పది లక్షల రూపాయలు విరాళంగా ఇస్తుందని, అలాగే, ఆర్టిస్టులు కూడా విరాళాలు ఇవ్వాలని కోరుతున్నట్టు చెప్పారు. 
Go Back to Shorts
kerala
maa
shivaji raja

More Telugu News