నేడు పెళ్లి... నిన్నటి నుంచి వరుడి అదృశ్యం... విజయవాడలో ఆగిన వివాహం!

  • విజయవాడ చిట్టినగర్ లో ఘటన
  • శుభలేఖలు పంచి వస్తానని వెళ్లిన నాగేంద్ర
  • ఇంటికి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు
మరికొన్ని గంటల్లో పెళ్లి చేసుకోవాల్సిన ఓ వరుడు అదృశ్యం కావడంతో విజయవాడలో ఓ పెళ్లి ఆగిపోయింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, విజయవాడ, చిట్టినగర్, గొల్లపాలెం గట్టు ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పసుపులేటి కృష్ణారావు, రెండో కుమారుడు నాగేంద్రబాబుకు, పాత రాజరాజేశ్వరీ పేటకు చెందిన ఓ యువతితో పెళ్లి నిశ్చయమైంది.

గురువారం నాడు శుభముహూర్తం ఉందని పండితులు నిశ్చయించడంతో పెళ్లి ఏర్పాట్లు జరిగిపోయాయి. ఈ క్రమంలో బుధవారం నాడు శుభలేఖలను పంచి వస్తానని వెళ్లిన నాగేంద్ర, ఆపై తిరిగి రాలేదు. రాత్రి వరకూ వేచి చూసిన తల్లిదండ్రులు కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, నాగేంద్ర సెల్ నంబర్ ఆధారంగా ఎంక్వయిరీ ప్రారంభించారు.
Go Back to Shorts
Vijayawada
Marriage
Police

More Telugu News