ఏపీ బీజేపీకి కొత్త కార్యవర్గం.. నలుగురు ప్రధాన కార్యదర్శులను సూచించిన కన్నా

  • మాణిక్యాలరావు, సురేష్ రెడ్డి, శ్యాంకిషోర్, సత్యమూర్తిల పేర్లు సిఫార్సు 
  • రేపట్లోగా కార్యవర్గాన్ని ప్రకటించనున్న హైకమాండ్
  • యువతకు ప్రాధాన్యత
ఏపీ బీజేపీకి నూతన కార్యవర్గం ఏర్పాటు కాబోతోంది. ప్రధాన కార్యదర్శులుగా నలుగురి పేర్లను రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ హైకమాండ్ కు సూచించారు. వీరిలో మాజీ మంత్రి మాణిక్యాలరావు, సురేష్ రెడ్డి, శ్యాంకిషోర్, సత్యమూర్తిలు ఉన్నారు. మరోపక్క, మొత్తం 19 మందితో కూడిన అధికార ప్రతినిధుల జాబితాను కూడా సిద్ధం చేస్తున్నారు.

రేపట్లోగా ఈ కార్యవర్గాన్ని బీజేపీ హైకమాండ్ అధికారికంగా ప్రకటించనుంది. రానున్న ఎన్నికల్లో పార్టీని మరింత ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్లే క్రమంలో... పార్టీ కార్యవర్గంలో మార్పులు చేర్పులు చేస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టే క్రమంలో యువతకు ప్రాధాన్యమిస్తున్నట్టు బీజేపీ నేతలు తెలిపారు.
Go Back to Shorts
bjp
kanna lakshminarayana

More Telugu News