2019 ఎన్నికల్లో రికార్డులు బద్దలు కాబోతున్నాయి: లోకేశ్‌

  • ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఘనత చంద్రబాబుది
  • రూ.25 వేల కోట్ల రైతు రుణ మాఫీ చేశారు
  • ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబే బ్రాండ్‌ అంబాసిడర్‌
ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు తాము చేస్తోన్న అభివృద్ధి పనులకు పూర్తిగా మద్దతు తెలుపుతారని, 2019 ఎన్నికల్లో రికార్డులు బద్దలు కాబోతున్నాయని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేశ్‌ మాట్లాడుతూ... ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఘనత చంద్రబాబు నాయుడిదని, రూ.25 వేల కోట్ల రైతు రుణ మాఫీ చేశారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబే బ్రాండ్‌ అంబాసిడరని, ఇటుక ఇటుక పేర్చి రాజధాని నిర్మాణం కోసం కృషి చేస్తున్నారని అన్నారు. బీజేపీ కుట్రలు పన్నుతోందని, ప్రత్యేక ప్యాకేజీ అంటూ మోసపూరిత వాగ్దానాలతో కేంద్ర సర్కారు మోసం చేసిందని అన్నారు.
Go Back to Shorts
Nara Lokesh
Chandrababu
Telugudesam

More Telugu News