చికెన్‌ వండలేదని తల్లిని చంపిన కుమారుడు

  • గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో ఘటన
  • మద్యం తాగి మధ్యాహ్నం ఇంటికి వచ్చిన కొడుకు
  • తల్లిని కత్తితో పొడిచిన వైనం
కంటికి రెప్పలా కాపాడుకుంటూ తనని పెంచి, ప్రయోజకుడిని చేసిన కన్న తల్లినే కడతేర్చాడు ఓ పుత్రరత్నం. గుంటూరు జిల్లా తాడికొండ మండలం బడేపురంలో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బయటికెళ్లి బాగా మద్యం తాగి మధ్యాహ్నం ఇంటికి వచ్చిన కిశోర్‌ అనే వ్యక్తి తన తల్లి మరియమ్మ (60) ని అన్నం పెట్టమన్నాడు. అయితే, కోడి కూర వండలేదని తెలుసుకున్న కిశోర్‌.. ఆగ్రహంతో ఊగిపోయి కత్తితో పొడిచి ఆమెను హత్య చేశాడు. నిందితుడు ఆర్‌ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నాడని, ఆస్తి విషయంలోనూ కొన్ని రోజులుగా తల్లితో గొడవ పడుతున్నాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం కిశోర్‌ పరారీలో ఉన్నాడని చెప్పారు.

murder
Crime News
Guntur District

More Telugu News