ఐపీఎల్ 2018.. ముంబై ఇండియన్స్ ఘన విజయం

  • కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుపై 6 వికెట్ల తేడాతో విజయం
  • 175 పరుగుల లక్ష్యాన్నిఅవలీలగా ఛేదించిన ముంబై ఇండియన్స్
  • చెలరేగి ఆడిన ఓపెనర్ సూర్యకుమార్, హిట్టర్ క్రునాల్ పాండ్యా  
ఐపీఎల్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఐపీఎల్ 2018 సీజన్ లో ఇండోర్ వేదికగా నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుపై 6 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ జట్టు అవలీలగా ఛేదించి.. విజయాన్ని సొంతం చేసుకుంది. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 174 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ జట్టు 19 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్ (57), హిట్టర్ క్రునాల్ పాండ్యా (31 నాటౌట్) లు చెలరేగి ఆడటంతో ముంబై ఇండియన్స్ విజయ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. 
Go Back to Shorts
ipl
mumbai indians

More Telugu News