ఈ ఏడాదిలో చంద్రబాబుకు బీజేపీ చుక్కలు చూపిస్తుంది: సోము వీర్రాజు

  • ధర్మపోరాట దీక్షకు రూ.30 కోట్లు ఖర్చు చేశారు
  • మోదీపై బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు తగదు
  • పోలీసులకు ఫిర్యాదు చేస్తాం
ఏపీ సీఎం చంద్రబాబుపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి విరుచుకు పడ్డారు. ఈ ఏడాదిలో చంద్రబాబుకు బీజేపీ చుక్కలు చూపిస్తుందని వ్యాఖ్యానించారు. విజయవాడలో చంద్రబాబు నిన్న చేసిన ధర్మపోరాట దీక్షకు రూ.30 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా బాలకృష్ణపై ఆయన మండిపడ్డారు. చంద్రబాబు ధర్మపోరాట దీక్షలో ప్రధాని మోదీపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. మోదీపై, బీజేపీ నేతలపై టీడీపీ నేతలు తమ ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తుండటం సబబు కాదని అన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

BJP
somu veeraj
Chandrababu
Balakrishna

More Telugu News