మధ్యప్రదేశ్ లో ఆరు నెలల పసిగుడ్డుపై హత్యాచారం!

  • సెల్లార్ లో రక్తమోడుతున్న ఆరు నెలల పసిగుడ్డు 
  • పసిపాప ప్రైవేటు భాగాలు, తలపై గాయాలు
  • సీసీ పుటేజ్ ఆధారంగా నిందితుడు సునీల్ భీల్ గా గుర్తింపు
ఆరునెలల పసిగుడ్డుపై హత్యాచారానికి పాల్పడ్డాడో మానవ మృగం. ఈ దారుణ ఘటన వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌ లోని ఇండోర్‌ లో స్థానికుల ఫిర్యాదుతో ఒక సెల్లార్ లో రక్తపుమడుగులో పడి ఉన్న శిశువు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దానిపై దర్యాప్తు చేపట్టారు.

స్థానిక సీసీ టీవీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితుడిని సునీల్‌  భీల్ (‌21) గా గుర్తించారు. శిశువు తల్లిదండ్రులు రాజ్వాడాలో బెలూన్లు అమ్ముకుని జీవిస్తారని, వారికి నిందితుడు పరిచయస్తుడని పోలీసులు తెలిపారు. శిశువు శరీరంలోని ప్రైవేటు భాగాల్లోనూ, తలపైన గాయాలను గుర్తించామని వారు వెల్లడించారు. కేసు నమోదు చేశామని, నిందితుడ్ని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
Go Back to Shorts
6 months baby raped and murdered
Madhya Pradesh
indore

More Telugu News