జగన్, పవన్‌లను కలపాలని ఢిల్లీలో కొందరు ప్రయత్నిస్తున్నారు: జేసీ దివాకర్‌రెడ్డి

  • పవన్, జగన్ ఇద్దరూ సీఎం కావాలని కోరుకుంటున్నారు
  • ఢిల్లీ పెద్దలు చేసే ప్రయత్నాలు సఫలం కావు
  • చంద్రబాబు, లోకేశ్‌పై కొందరు ఆరోపణలు చేస్తున్నారు
వైసీపీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను కలపాలని ఢిల్లీలో కొందరు ప్రయత్నిస్తున్నారని, కానీ, ఆ ఇద్దరు నాయకులూ సీఎం కావాలని కోరుకుంటున్నారని, దీంతో ఢిల్లీ పెద్దలు చేసే ప్రయత్నాలు సఫలం కావని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు.

ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై విచారణ జరపాలని కొందరు అంటున్నారని, వారు ఏం అవినీతి చేశారని విచారణ జరుపుతారని నిలదీశారు. వైఎస్సార్‌ హయాంలో కూడా చంద్రబాబుపై విచారణ జరిపారని, కానీ ఏమీ చేయలేకపోయారని అన్నారు. కాగా, 2019 ఎన్నికల్లో అవినీతిపరులు, సమర్థంగా పనిచేయని వారికి తమ పార్టీ నుంచి టిక్కెట్లు రావని జేసీ అన్నారు. 
Go Back to Shorts
jc
Chandrababu
Pawan Kalyan
Jagan

More Telugu News