ఇంతటి సంతోషాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు నా ధన్యవాదాలు: హీరోయిన్ సమంత

  • రామలక్ష్మి పాత్రను ఎప్పటికీ మర్చిపోలేను
  • చిట్టిబాబు లేకపోతే రామలక్ష్మి లేదు
  • సుకుమార్ కు నా ధన్యవాదాలు
 ‘రంగస్థలం’ సక్సెస్ మీట్ కు సమంత హాజరైంది. ఇంతటి సంతోషాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు తన ధన్యవాదాలని, చాలా తృప్తిగా ఉందని చెప్పింది. ఈ చిత్రంలో తాను పోషించిన రామలక్ష్మి పాత్రను ఎప్పటికీ మర్చిపోలేనని, ఇలాంటి పాత్రలో నటించే అవకాశమిచ్చిన దర్శకుడు సుకుమార్ కు తన ధన్యవాదాలను తెలిపింది.

చిట్టిబాబు లేకపోతే రామలక్ష్మి లేదని, ఈ చిత్రయూనిట్ లో తాను కూడా ఉన్నందుకు గర్వంగా ఉందని తెలిపింది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ వేడుకకు హాజరైనందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపింది. అనంతరం, నటుడు జగపతిబాబు మాట్లాడుతూ, ఈ సినిమా ఎలా ఉందని బయ్యర్ ని అడిగితే ఎంత కలెక్షన్లు వస్తాయో తెలియదని అనడం సంతోషంగా ఉందని అన్నారు. తన ముప్పై ఏళ్ల సినిమా చరిత్రలో ‘రంగస్థలం’లో తాను పోషించిన ‘ప్రెసిడెంట్’ పాత్ర ఉత్తమమైందని అన్నారు. బాలీవుడ్ లో అవకాశం కోసం తాను ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నానని, ‘రంగస్థలం’ తర్వాత ఆ అవకాశం వచ్చిందని, ఈ వివరాలు త్వరలో చెబుతానని అన్నారు.

rangasthalam
heroine samantha

More Telugu News