పోలవరం ప్రాజెక్టు పనులను అడ్డుకునేందుకు కుట్ర: మంత్రి దేవినేని

  • స్వచ్ఛంద సంస్థల ముసుగులో కోర్టుల్లో పిటిషన్లు వేస్తున్నారు
  • మాపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు
  • పోలవరంపై ఏ విచారణకైనా సిద్ధం  
ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులను అడ్డుకునేందుకు కుట్ర జరుగుతోందని, స్వచ్ఛంద సంస్థల ముసుగులో కొందరు కోర్టుల్లో పిటిషన్లు వేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. ఈ రోజు ఆయన రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడుతూ... తమపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కొందరు కోరుతున్నారని, తాము పోలవరంపై ఏ విచారణకైనా సిద్ధమని, ప్రాణత్యాగం చేసైనా ప్రాజెక్టు నిర్మిస్తామని చెప్పారు. వైసీపీ అధినేత జగన్ చేయించిన ఫిర్యాదుల కారణంగానే పోలవరం ఆలస్యం అవుతోందని తెలిపారు. పోలవరం పనులు ఇప్పటివరకు 54.4 శాతం పూర్తయ్యాయని వివరించారు.    
Go Back to Shorts
polavaram
devineni
Jagan

More Telugu News