రేపు హైద‌రాబాద్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో శ్రీదేవికి సంతాప సభ

  • ఇటీవ‌ల మృతి చెందిన సినీన‌టి శ్రీదేవి
  • హైద‌రాబాద్ బంజారాహిల్స్ లోని పార్క్ హ‌య‌త్ హోటల్ లో సంతాప సభ
  • రేపు సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభం
ఇటీవ‌ల మృతి చెందిన సినీ నటి శ్రీదేవి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ హైద‌రాబాద్ బంజారాహిల్స్ లోని పార్క్ హ‌య‌త్ హోటల్ లో రేపు ఎంపీ టీ సుబ్బ‌రామి రెడ్డి ఆధ్వ‌ర్యంలో టాలీవుడ్ ప్ర‌ముఖులు సంతాప‌ స‌భ నిర్వ‌హించ‌నున్నారు. రేపు సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభం కానున్న ఈ సంతాప స‌భ‌కు సినీనటులు కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, మోహన్ బాబు, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, జూనియర్ ఎన్టీఆర్, జయసుధ, నివేదా థామస్ తో పాటు పలువురు హాజరుకానున్నారు. సినీ దర్శకులు రాఘవేంద్రరావు, రామ్ గోపాల్ వర్మతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరుకానున్నట్లు తెలిసింది.    
Go Back to Shorts
Sridevi
Chiranjeevi
tsr
Hyderabad
Balakrishna

More Telugu News