త్రిపురలో నువ్వా? నేనా?.. బీజేపీ, వామపక్షాల పోటాపోటీ!

  • 25 ఏళ్లుగా త్రిపురను పాలిస్తున్న వామపక్షాలు
  • 59 అసెంబ్లీ సీట్లు, మ్యాజిక్ ఫిగర్ 31
  • వామపక్షాల ఆధిక్యం 28, బీజేపీ 27, కాంగ్రెస్ ఒకటి
గత 25 ఏళ్లుగా వామపక్ష కూటమికి పెట్టనికోటగా పేరొందిన త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో బీజేపీ, వామపక్షాలు హోరాహోరీగా ఆధిక్యం ప్రదర్శిస్తున్నాయి. త్రిపురలో మొత్తం 59 అసెంబ్లీ సీట్లు వుండగా, వామపక్షాలు 28 స్థానాల్లోను,  బీజేపీ 27 స్థానాల్లోను ఆధిక్యంలో నిలబడ్డాయి. దీంతో వామపక్షాలతో బీజేపీ హోరాహోరీ తలపడుతున్నట్టు తెలుస్తోంది. త్రిపురలో అధికారం చేపట్టాలంటే 31 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవాలి. 
Go Back to Shorts
tripura
elections
counting

More Telugu News