ఇక సెలవు.. అభిమానుల అశ్రునయనాల మధ్య ముగిసిన శ్రీదేవి అంత్యక్రియలు!

  • అంత్యక్రియలకు వివిధ భాషలకు చెందిన సినీ ప్రముఖులు హాజరు
  • మహారాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
  • దశాబ్దాలపాటు వెండితెరను రాణిలా ఏలిన శ్రీదేవి
 సినీనటి శ్రీదేవి అంతిమ సంస్కారాలు ముంబయి విల్లే పార్లేలోని సేవా సమాజ్‌ శ్మశాన వాటికలో ముగిశాయి. కడసారి ఆమెను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. మహారాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియలకు వివిధ భాషలకు చెందిన సినీ ప్రముఖులు హాజరయ్యారు. దశాబ్దాలపాటు వెండితెరను రాణిలా ఏలిన శ్రీదేవి ఇక లేదన్న వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన శ్రీదేవి అంతిమ యాత్ర ఏడు కిలోమీటర్ల మేర కొనసాగిన విషయం తెలిసిందే. 
Go Back to Shorts
Sridevi
funeral
mumbai

More Telugu News