స్మార్ట్‌ఫోన్ కొనివ్వ‌లేద‌ని బావిలో దూకి ఆత్మహత్య!

  • మహబూబాబాద్ కేసముద్రం మండలం దన్నసరి గ్రామశివారులో ఘటన
  • ఇంటర్మీడియట్ చదువుతోన్న బానోత్ మోహన్ (16) 
  • దర్యాప్తు చేస్తోన్న పోలీసులు
స్మార్ట్‌ఫోన్ కొనివ్వ‌డం లేద‌న్న చిన్న కార‌ణంతో అలిగిన ఓ బాలుడు బావిలో దూకి ఆత్మహ‌త్య చేసుకున్న ఘ‌ట‌న మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం దన్నసరి గ్రామశివారులోని సబ్‌స్టేషన్ తండాలో చోటు చేసుకుంది. సెల్‌ఫోన్ కొనివ్వ‌క‌పోతే ఇంత‌టి క‌ఠిన నిర్ణ‌యం తీసుకుంటాడ‌ని తాము అనుకోలేద‌ని ఆ బాలుడి తల్లిదండ్రులు ఆవేద‌న చెందారు. ఈ ఘటనపై స‌మాచారం అందుకున్న‌ పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకుని వివ‌రాలు తీసుకున్నారు.

ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ బాలుడి పేరు బానోత్ మోహన్ (16) అని, అత‌డు స్థానిక క‌ళాశాల‌లో ఇంటర్మీడియట్ చదువుతున్నాడని తెలిపారు. త‌న‌కు సెల్‌ఫోన్ కావాల‌ని కొన్ని రోజులుగా త‌న త‌ల్లిదండ్రుల‌ను కోరుతున్నాడ‌ని తెలిపారు.   
Go Back to Shorts
suicide
student
inter
Mahabubabad District

More Telugu News