బీజేపీతో విడిపోతామన్న సంకేతాలు ఇచ్చిన చంద్రబాబు.. జాతీయ పత్రికల్లో ప్రముఖ వార్త!

  • మిత్రధర్మం పాటిస్తున్నామన్న చంద్రబాబు
  • దణ్ణం పెట్టి తప్పుకుంటామన్న ఏపీ సీఎం
  • ప్రధాన వార్తగా కవర్ చేసిన జాతీయ మీడియా
బీజేపీతో మిత్రధర్మం పాటిస్తున్నామని, కుదరదని భావిస్తే దణ్ణం పెట్టి తప్పుకుంటామే తప్ప రచ్చ చేయబోమని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను జాతీయ మీడియా ప్రముఖంగా ప్రచురించింది. ఎన్డీయేలో విభేదాలు వచ్చాయని, బీజేపీతో తన స్నేహాన్ని తెలుగుదేశం పార్టీ వదులుకోనుందని, ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి నుంచి సంకేతాలు వచ్చాయని పలు రాష్ట్రాల్లోని స్థానిక పత్రికలు వార్తను ప్రచురించాయి.

రాష్ట్రం అభివృద్ధి కోసం తానెంతో కష్టపడుతుంటే, కొందరు బీజేపీ నేతలు అడ్డుపడుతున్నారని, వారు విమర్శిస్తుంటే, ప్రతి విమర్శలు చేయకుండా టీడీపీ నేతలను తానే నియంత్రిస్తున్నానని నిన్న చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వార్తను జాతీయ న్యూస్ ఏజన్సీలు ప్రముఖంగా కవర్ చేయడంతో, దేశంలోని దాదాపు అన్ని పత్రికలూ ఈ వార్తను ఏదో ఒక చోట ప్రచురించడం గమనార్హం.

Chandrababu
Telugudesam
BJP
National Media

More Telugu News