బస్సులో ప్రయాణికుడి మృతి.. రోడ్డుపై వదిలేసి వెళ్లిన వైనం!

  • తమిళనాడులోని సూళగిరిలో ఘటన
  • దారి మధ్యలో అకస్మాత్తుగా కన్ను మూసిన వీరన్ అనే వ్యక్తి
  • పోలీసులకు సమాచారం అందించిన వీరన్ మిత్రుడు రాధాకృష్ణన్
బస్సులో ప్రయాణిస్తూ చనిపోయిన వ్యక్తిని డ్రైవర్‌, కండక్టర్‌ నడిరోడ్డుపై దించేసి వెళ్లిపోయిన ఘటన తమిళనాడులోని సూళగిరిలో జరిగింది. వీరన్ (54)‌, రాధాకృష్ణన్‌ (44) అనే వ్యక్తులు బెంగళూరుకి ఉపాధి కోసం వెళ్లారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో తమ సొంత గ్రామమయిన తిరుకోయిలూరు సమీపంలోని కనకనందం గ్రామానికి బస్సులో వస్తున్నారు. దారి మధ్యలో వీరన్ అకస్మాత్తుగా కన్ను మూశాడు.

ఈ విషయాన్ని గుర్తించిన డ్రైవర్‌, కండక్టర్‌ జాతీయ రహదారిపై బస్సుని నిలిపి మృతదేహాన్ని దించి వెళ్లిపోయారు. దీంతో రాధాకృష్ణన్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వీరన్ మృత దేహాన్ని ఆసుపత్రికి తరలించారు. తన స్నేహితుడు చనిపోతే మానవత్వం లేకుండా నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారని రాధాకృష్ణన్ చెప్పాడు. 
Go Back to Shorts
Tamilnadu
passenger
died

More Telugu News