తిరుమల వెంకన్నపై సంచలన వ్యాఖ్యలు చేసిన కనిమొళి!

  • కోట్లు ఇచ్చేవారికే ఆయన దేవుడు
  • పేదవారిని కాపాడలేని దేవుడెందుకు?
  • హుండీనే కాపాడుకోనివాడు భక్తులను ఎలా కాపాడతాడు?
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి కొలువుండే తిరుమలపై డీఎంకే ఎంపీ కనిమొళి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పేదవాడిని కాపాడలేని దేవుడు మనకెందుకని ఆమె అన్నారు. దేవుడి ముందు అంతా సమానమే అని నీతులు చెబుతుంటారని... వాస్తవానికి డబ్బున్నవారే దేవుడి వద్దకు ప్రత్యేక దర్శనం ద్వారా వెళుతున్నారని మండిపడ్డారు. డబ్బు లేనివారికి రోజులపాటు పడిగాపులు తప్పవని విమర్శించారు. కోట్లాది రూపాయలు ఇచ్చే కోటీశ్వరులకే ఆయన దేవుడు అని అన్నారు. తన సొంత హుండీనే కాపాడుకోలేని దేవుడు... భక్తులను ఎలా కాపాడతాడని ప్రశ్నించారు. 
Go Back to Shorts
kanimozhi
tirumala

More Telugu News