నాతో నటించాకే హీరోగా ఆయన నిలదొక్కుకున్నాడు: జమున

  • అప్పటివరకూ ఆయన విలన్ పాత్రలు చేస్తూ వస్తున్నాడు 
  • నాతో హీరోగా చేయడానికి ఓకే అన్నాను 
  • వేరొకరైతే కుదరదని చెప్పేవారు      
ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. కృష్ణ .. హరనాథ్ .. జగ్గయ్య సరసన కథానాయికగా జమున అనేక చిత్రాల్లో నటించారు. ఆమె చేసిన సినిమాల జాబితాలో చాలా వరకూ విజయవంతమైనవే .. కథానాయికగా ఆమె క్రేజ్ ను అంతకంతకూ పెంచేసినవే. అలాంటి జమున తాజాగా తెలుగు పాప్యులర్ టీవీతో మాట్లాడుతూ, ఎన్టీఆర్ .. ఏఎన్నార్ తరువాత తరం వారితోను కథానాయికగా నటించినప్పటి విషయాలను ప్రస్తావించారు.

 " నా తరువాత వచ్చినవారితో నటిస్తున్నప్పుడు వాళ్లంతా కూడా చాలా గౌరవం ఇచ్చేవారు. సీనియర్ ఆర్టిస్ట్ అని చాలా మర్యాద పూర్వకంగా చూసేవారు. ఒక వ్యక్తిని మాత్రం నేనే హీరోను చేశాను. అంతకుముందు విలన్ పాత్రలు చేస్తూ వస్తోన్న ఆయనను హీరోను చేశాను. ఆయన యంగ్ విలన్ గా చేస్తున్నాడు .. ఆయన సరసన నేనెందుకు హీరోయిన్ గా చేయాలని చెప్పేసి .. వేరేవాళ్లయితే నో చెప్పేవారు. మొదటి నుంచి ఇలాంటి విషయాలను నేను పెద్దగా పట్టించుకోను కనుక సరే అనేశాను. నాతో హీరోగా చేసిన తరువాతనే ఆయన హీరోగా నిలదొక్కుకున్నాడు" అంటూ చెప్పుకొచ్చారు. ఆయన కృష్ణంరాజు అనే విషయం ఇప్పటికే అందరికీ అర్థమైపోయి ఉంటుంది.    

Go Back to Shorts
jamuna
krishnam raju

More Telugu News