కన్నడ హీరోలతో కలసి కారులో వెళుతూ యాక్సిడెంట్ చేసిన ఆదికేశవులు నాయుడు మనవడు... పరారీలో హీరోలు!

  • విష్ణుతో పాటు కారులో ప్రజ్వల్, దిగంత్
  • గంజాయి తాగి, మితిమీరిన వేగంతో ప్రయాణం
  • ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
  • హీరోల కోసం పోలీసుల గాలింపు
టీటీడీ మాజీ చైర్మన్ ఆదికేశవులు నాయుడి మనవడు విష్ణు, బెంగళూరు సమీపంలో తన స్నేహితులైన ఇద్దరు కన్నడ హీరోలతో వెళుతూ యాక్సిడెంట్ చేశాడు. ఈ ఘటన అనంతరం ఇద్దరు హీరోలు ప్రజ్వల్, దిగంత్ లు పారిపోగా, విష్ణును అరెస్ట్ చేసిన పోలీసులు, వెండితెర వేల్పుల కోసం వేట మొదలు పెట్టారు.

మరిన్ని వివరాల్లోకి వెళితే, గంజాయి సేవించి, మితిమీరిన వేగంతో తన మెర్సిడిస్ బెంజ్ కారులో లాల్ బాగ్ ప్రాంతం నుంచి ఇంటికి బయలుదేరాడు విష్ణు. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఓ కారును ఓవర్ టేక్ చేయబోయి, డివైడర్ ను ఢీకొట్టి, ఆపై ముందు వెళుతున్న ఓమ్నీ వ్యాన్ ను ఢీకొట్టారు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు అయ్యాయి.

దీంతో స్థానికులు చుట్టు ముట్టి ప్రజ్వల్, దిగంత్, విష్ణులపై దాడికి దిగారు. సమాచారం అందుకున్న జయనగర్ పోలీసులు విష్ణును అరెస్ట్ చేశారు. ఈలోగా ప్రజ్వల్, దిగంత్ లు పారిపోయారు. కారులో సోదాలు చేయగా 100 గ్రాముల గంజాయి ప్యాకెట్ లభించింది. కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించిన పోలీసులు, పరారీలో ఉన్న హీరోల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Go Back to Shorts
vishnu
adikeshavulu nayudu
prajwal
digant
kannada heros

More Telugu News