పవన్ మూవీ నైజామ్ హక్కులు షాకిస్తున్నాయి!

పవన్ కల్యాణ్ .. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రం రూపొందుతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో జరుగుతోంది. సెట్స్ పై ఉండగానే ఈ సినిమా బిజినెస్ ఒక రేంజ్ లో జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.

ఈ సినిమా నైజామ్ హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నట్టుగా చెబుతున్నారు. ఇందుకోసం ఆయన 29 కోట్లను చెల్లించాడని అంటున్నారు. నైజామ్ ఏరియాలో 'బాహుబలి' తరువాత ఈ స్థాయి రేటు పలికి సినిమా ఇదేనని చెబుతున్నారు. నైజామ్ లో మెగా ఫ్యామిలీకి అభిమానులు ఎక్కువ .. ఆదరణ ఎక్కువ. ఇక్కడ వసూళ్లు కూడా భారీగానే ఉంటూ ఉంటాయి. అందువలన నైజామ్ హక్కులకు భారీ రేటు పలికినట్టుగా చెప్పుకుంటున్నారు.  
Go Back to Shorts
pavan
keerthi

More Telugu News