శుభవార్త.. ఏటీఎంల‌తో పాటు బ్యాంకుల్లో న‌గ‌దు విత్ డ్రా ప‌రిమితి పెంచిన ఆర్‌బీఐ

ఏటీఎంల‌లో రోజుకు న‌గ‌దు ఉప‌సంహ‌ర‌ణ పరిధిని ఇటీవ‌లే 2,500 నుంచి 4,500 రూపాయ‌ల‌కు పెంచిన రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఈ రోజు ఆ ప‌రిమితిని మ‌రింత పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఇక‌పై ఖాతాదారులు ఏటీఎంల నుంచి రోజుకు రూ.10 వేలు విత్ డ్రా చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది. అలాగే కరెంటు ఖాతాల నుంచి ఖాతాదారుల విత్ డ్రా పరిమితిని కూడా పెంచుతున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు వున్న నగదు విత్ డ్రా పరిమితిని లక్ష రూపాయల వరకు పెంచుతున్నట్లు తెలిపింది.
Go Back to Shorts
demonitisation
bank

More Telugu News