ఖాతాదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఎస్‌బీటీ

వడ్డీరేట్లపై ఏకంగా 25-30 బేసిస్ పాయింట్లను తగ్గిస్తున్న‌ట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్ కోర్(ఎస్‌బీటీ) త‌మ‌ ఖాతాదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. స‌ద‌రు బ్యాంకు ప్ర‌క‌టించిన ఈ ఆఫ‌ర్ ప్ర‌కారం.. సగటు ఎంఎల్ఆర్ 8.6 శాతంగా ఉండ‌నుంది. ఒక నెలకు 8.80 శాతం, మూడు నెలలకు 8.90 శాతం, ఆరు మాసాలకు 9.05 శాతం ఈ వ‌డ్డీ రేటు ఉంటుంది. ఇక‌ వార్షిక రేటును 9.20 శాతం , రెండేళ్ల రేటు 9.25 శాతం మూడేళ్ల వ‌డ్డీరేటు 9.30 శాతంగా ఉండ‌నుంది. ఎల్లుండి నుంచే ఈ  తగ్గింపు  రేట్లు అమల్లోకి రానున్నాయి. దీనిపై స్పందించిన బ్యాంకుల కార్యనిర్వాహక బోర్డు ఎస్సెట్స్ అండ్ లయబిలిటీ ఇదో మంచి సంకేతమ‌ని పేర్కొంది. అలాగే ఎస్‌బీఐ కూడా దీనిపై నిర్ణయం తీసుకోవాలని వ్యాఖ్యానించింది.
Go Back to Shorts
sbt offer

More Telugu News