మ్యాగ్‌ వరల్డ్‌ ఎక్స్‌పో 2023 వద్ద జరిగిన కెడీఎం కార్నివాల్‌

మ్యాగ్‌ వరల్డ్‌ ఎక్స్‌పో 2023 వద్ద జరిగిన కెడీఎం కార్నివాల్‌
ముంబై, 20 ఫిబ్రవరి 2023 : ముంబై కేంద్రంగా కలిగిన సుప్రసిద్ధ లైఫ్‌స్టైల్‌ మరియు ప్రీమియం మొబైల్‌ యాక్ససరీస్‌ బ్రాండ్‌ కెడీఎం,  ఇటీవల జరిగిన రెండవ  ఎడిషన్‌  మ్యాగ్‌ వరల్డ్‌ ఎక్స్‌పో 2023 వద్ద కెడీఎం కార్నివాల్‌ నిర్వహించింది.


కెడీఎం ప్రీమియం మొబైల్‌ యాక్ససరీలను విస్తృత శ్రేణిలో వినియోగదారులకు చేరువ చేయాలనే లక్ష్యంతో కార్నివాల్‌ను తీర్చిదిద్దారు.  బ్రాండ్‌ సిద్ధాంతమైన ‘కరో దిల్‌ కీ మర్జీ ’ , ప్రతి భారతీయుడినీ చేరుకుంటుంది. కెడీఎం తమ వినియోగదారులను మనసు చెప్పినట్లు నడుచుకోమని ప్రోత్సహిస్తుంది.


కెడీఎం ఫౌండర్‌ ఎన్‌ డీ మలి మాట్లాడుతూ ‘‘ఈ మహోన్నత కార్యక్రమంలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. నెట్‌వర్కింగ్‌ అవకాశాలను ఇది అందించడంతో పాటుగా  మా ప్రీమియం ఉత్పత్తులను సైతం  ప్రదర్శించేందుకు వేదికను అందించింది. యువతకు ఇప్పుడు తమ సంగీత, జీవనశైలి అవసరాలను తీర్చుకునేందుకు ప్రాధాన్యతా ఎంపికగా కెడీఎం నిలుస్తుంది. యువతకు మేము ఒకటే చెబుతున్నాం. ఇది మీ జీవితం, మీ మనసు చెప్పినట్లు నడుచుకోండి !’’అని అన్నార.


కెడీఎం కో–ఫౌండర్‌ భవార్‌లాల్‌ సుథార్‌ మాట్లాడుతూ ‘‘ వినూత్నమైన ఆలోచనల ద్వారా మేము భావొద్వేగ బంధాలను ఏర్పరుచుకోవాలని మేము ప్రయత్నిస్తున్నాము. మా ఆకర్షణీయమైన, శక్తివంతమైన వైర్‌లెస్‌ స్పీకర్లు, నెక్‌బ్యాండ్స్‌, హెడ్‌ఫోన్స్‌తో వేడుక చేసుకోవాల్సిందిగా వినియోగదారులను ప్రోత్సహిస్తున్నాము’’ అని అన్నారు.
మ్యాగ్‌ వరల్డ్‌ ఎక్స్‌పో 2023
కెడీఎం కార్నివాల్‌

Watch Today's Deals on Amazon

More Press News