నగరాభివృద్ధియే లక్ష్యంగా డివిజన్ సమస్యల పరిష్కారం: విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి

నగరాభివృద్ధియే లక్ష్యంగా డివిజన్ సమస్యల పరిష్కారం: విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి
  • 7వ డివిజన్ నందు రూ.14 లక్షల అంచనాలతో యు.జి.డి పనులకు శంకుస్థాపన
విజయవాడ: సర్కిల్-3 పరిధిలోని 7వ డివిజన్ మొగల్రాజ్ పురం దాసరి రమణ నగర్ నందలి రూ.14 లక్షల అంచనాలతో పలు అంతర్గత రోడ్ల భూగర్భ డ్రైనేజి పైపు లైన్ పనులకు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటి మేయ‌ర్ బెల్లం దుర్గ‌, తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ మరియు స్థానిక కార్పొరేటర్ మెరకనపల్లి మాధురిలతో క‌లిసి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. నగర అభివృద్ధి దృష్టిలో ఉంచికొని అనేక కోట్ల రూపాయలతో డివిజన్లలో పలు అభివృద్ధి పనులు చేపట్టి వాటిని సకాలంలో పూర్తి చేయుట జరుగుతుందని అన్నారు. ఈ ప్రాంతములో 6 అంగుళాల పాత డ్రెయినేజి పైపులు ఉండుట కారణంగా డ్రెయినేజి ఇబ్బందులు ఎదురౌతున్న వాటిని తొలగించి వాటి స్థానములో 200 యం.యం. పైపులు వేయుట జరుగుతుందని, ఈ పనులు అన్నియు నెల రోజుల లోపుగా పూర్తి చేసి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులు మరియు కాంట్రాక్టును ఆదేశించారు.

కార్యక్రమములో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.చంద్ర శేఖర్, డిప్యూటీ ఇంజనీర్ టి.రంగారావు మరియు స్థానిక వై.సి.పి శ్రేణులు పాల్గొన్నారు.
VMC
Vijayawada
Andhra Pradesh

Watch Today's Deals on Amazon

More Press News