నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
ఆంధ్రప్రదేశ్ పౌరులందరికీ నూతన సంవత్సరం ఉత్సాహాన్ని, ఆనందాన్ని పంచాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు. 2021 నూతన సంవత్సరం ఆగమనం నేపథ్యంలో గవర్నర్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి తాజా పోకడలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రజలు తమ వేడుకలను జరుపుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన కోవిడ్ -19 మార్గదర్శకాలను పాటించాలని, నూతన సంవత్సర వేడుకలను సంయమనంతో జరుపుకోవాలని గవర్నర్ హరిచందన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే ప్రతి సంవత్సరం నూతన సంవత్సర తొలిరోజు ఆహ్లాదకరమైన వాతావరణంలో రాష్ట్ర ప్రజలు గవర్నర్ ను వ్యక్తిగతంగా కలిసి శుభాకాంక్షాలు తెలపటం అనవాయితీ కాగా, కరోనా నేపథ్యంలో ఈ విడత ఆ కార్యక్రమానికి రాజ్ భవన్ దూరంగా ఉండనుందని గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు.
Biswabhusan Harichandan
Andhra Pradesh

Watch Today's Deals on Amazon

More Press News