పబ్లిక్ టాయిలెట్స్, ఓపెన్ జిమ్ ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

పబ్లిక్ టాయిలెట్స్, ఓపెన్ జిమ్ ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ
ప్రజలకు సరిపడు పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో నూతనంగా నిర్మించిన పబ్లిక్ టాయిలెట్స్ మరియు ఓపెన్ జిమ్ ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ప్రజలకు సరిపడు టాయిలెట్స్ నిర్మిస్తున్నాం. వాటిని కూడా పూర్తి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. రోటరీనగర్ లో పబ్లిక్ టాయిలెట్స్, ఓపెన్ జిమ్ ప్రారంభం అనంతరం  Swachh bharat/Swachh telangana లో భాగంగా ఖమ్మం బైపాస్ లోని తెలంగాణ తల్లి సర్కిల్ వద్ద నూతనంగా రూ.12లక్షలతో ఏర్పాటు చేసిన ఆధునిక Cafe cum Toilets ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. తర్వాత  ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని మయూర్ సెంటర్ అండర్ బ్రిడ్జ్ వద్ద నూతనంగా నిర్మించిన పబ్లిక్ టాయిలెట్స్ ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు.
Puvvada Ajay Kumar

Watch Today's Deals on Amazon

More Press News