బోనాల జాతరపై వచ్చే నెల 10వ తేదీన నిర్ణయం: మంత్రి తలసాని

బోనాల జాతరపై వచ్చే నెల 10వ తేదీన నిర్ణయం: మంత్రి తలసాని
ఆషాడ మాసంలో నిర్వహించే బోనాల జాతరపై వచ్చే నెల 10వ తేదీన దేవాదాయ శాఖ మరియు దేవాలయ కమిటీలతో సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకొంటామని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ హామి ఇచ్చారు. బుదవారం పాత బస్తీలోని ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ సభ్యులు మంత్రిని కలసి వినతి పత్రం సమర్పించారు దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. జంట నగరాల్లోని దేవాలయాల కమిటీ సభ్యులను మరియు దేవాదాయ శాఖ అధికారులతో జూన్‌ 10వ తేదీన సమావేశం ఏర్పాటు చేసి అందరి సూచనలు, సలహాలు తీసుకొని పరిస్థితులపైన విఫులంగా చర్చించిన పిమ్మట తగు నిర్ణయం తీసుకొంటామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలియజేశారు.

ఉజ్జయిని మహాకాళి, సికింద్రాబాద్‌ ఆషాడ జాతర బోనాల పండుగ తేది.28.6.2020 ఆదివారం అమ్మవారి ఘటోత్సవాలు ప్రారంభం అవుతాయి. జూలై 12, 2020 అమ్మవారి జాతర మరియు 13.07.2020 రంగం జరుగుతుంది. గోల్కొండలో బోనాలు 25.06.2020న ప్రారంభమై 12.07.2020 సికింద్రాబాద్‌ మరియు 19.07.2020 తేదీలలో హైదరాబాదు బోనాల పండుగ జరుగనున్నాయి. మంత్రిని కలిసిన వారిలో జనగామ మధుసూదన్‌ గౌడ్‌, అధ్యక్షులు, భాగ్యనగర్‌ శ్రీ మహంకాలి జాతర ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ, బల్వంత్‌ యాదవ్‌, ఆకుల వేణుగోపాల్‌, శివ, చంద్రగిరి లు ఉన్నారు.
Hyderabad
Talasani

Watch Today's Deals on Amazon

More Press News