బందరులో ఒక బఫూన్ ఉన్నాడు: మంత్రి కొల్లు రవీంద్ర

Kollu Ravindra Criticizes Perni Nani Over Illegal Activities
  • మంగళగిరి టీడీపీ ఆఫీసులో మంత్రి కొల్లు రవీంద్ర మీడియా సమావేశం
  • వైసీపీ నేత పేర్ని నానిపై తీవ్ర విమర్శలు
  • మడ అడవులు ఆక్రమించి పేర్ని నాని అక్రమంగా చెరువులు తవ్వారన్న ఆరోపణ
  • తప్పు చేసిన వారిని ఎవరినీ వదిలిపెట్టబోమని అధికారులకు ఆదేశాలిచ్చినట్లు వెల్లడి
రాష్ట్ర ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన గట్టిగా హెచ్చరించారు. మంగళవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్‌తో పాటు పేర్ని నానిని లక్ష్యంగా చేసుకుని ఆయన తీవ్ర విమర్శలు చేశారు.

"బందరులో ఒక బఫూన్ ఉన్నాడు. షాడోలను అడ్డుపెట్టుకుని అక్రమంగా చెరువులు తవ్వించాడు. మడ అడవులను సైతం ఆక్రమించి చెరువులుగా మార్చేశాడు" అని పేర్ని నానిని ఉద్దేశించి కొల్లు రవీంద్ర ఆరోపించారు. అధికారులను బ్లాక్ మెయిల్ చేసి భూములు దోచుకోవడానికి నాని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.

కూటమి ప్రభుత్వంలో ఇలాంటి అక్రమాలకు తావులేదని స్పష్టం చేశారు. తప్పు చేస్తే ఎవరినీ ఉపేక్షించవద్దని ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని మంత్రి తెలిపారు. 
Go Back to Shorts
Kollu Ravindra
Perni Nani
Andhra Pradesh Politics
TDP
YCP
Bandar
Illegal Mining
Corruption
Political Criticism
Telugu Desam Party

More Telugu News