డ్రగ్స్ టెస్టుకు నేను సిద్ధం... కాంగ్రెస్ సవాల్ స్వీకరించిన కేటీఆర్

KTR Ready for Drugs Test Challenges Congress Allegations
  • మొయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ కలకలం
  • పట్టుబడిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి
  • కేటీఆర్ కూడా డ్రగ్స్ టెస్టు చేయించుకోవాలన్న టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
  • ఏ టెస్టుకైనా తాను సిద్ధమంటూ కేటీఆర్ ట్వీట్
  • మహేశ్ కుమార్ గౌడ్ సూచనను స్వాగతిస్తున్నానని వెల్లడి
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాను డ్రగ్స్ టెస్టుకు సిద్ధంగా ఉన్నానని ఆదివారం ప్రకటించారు. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో కాంగ్రెస్ నేతలు విసిరిన సవాల్‌ను ఆయన స్వీకరించారు. డ్రగ్స్ వాడేవారు ఎవరైనా, ఏ పార్టీకి చెందినవారైనా చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని స్పష్టం చేశారు.

"ఏ టెస్టుకైనా నేను సిద్ధమని ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు ఈ పరీక్ష చేయించుకోవాలన్న మహేశ్ కుమార్ గౌడ్ సూచనను స్వాగతిస్తున్నాను. మనమే ఉదాహరణగా నిలుద్దాం" అని కేటీఆర్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.

సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ డ్రగ్స్ టెస్టుకు రావాలని టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేశ్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. శనివారం రాత్రి మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌పై పోలీసులు దాడి చేయగా, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహా ఆరుగురు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ పరిణామాలపై స్పందించిన కేటీఆర్.. డ్రగ్స్ కేసును అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీపై బురద చల్లడం నీచ రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. ప్రతీ డ్రగ్స్ కేసులోకి అనవసరంగా తన పేరును లాగితే చట్టపరమైన నోటీసులతో స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

హైదరాబాద్ శివారు మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌పై శనివారం రాత్రి ఈగిల్ బృందం దాడి చేయగా, టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో పాటు మొత్తం ఆరుగురికి డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పట్టుబడిన వారిని ఈగిల్ బృందం మొయినాబాద్ పోలీసులకు అప్పగించింది.
Go Back to Shorts
KTR
K Taraka Rama Rao
Telangana
Drugs test
BRS
Congress
Revanth Reddy
Moinabad farmhouse
Pilot Rohit Reddy
Telangana politics

More Telugu News