ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు.. హాజరైన అమిత్ షా, నితిన్ గడ్కరీ

Ajit Pawar Funeral Concludes
  • విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన అజిత్ పవార్
  • బారామతిలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
  • పెద్ద ఎత్తున హాజరైన ఎన్సీపీ కార్యకర్తలు
విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి చెందిన సంగతి తెలిసిందే. బారామతిలోని విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో ఆయన అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే తదితరులు హాజరయ్యారు. అంత్యక్రియలకు పెద్ద ఎత్తున ఎన్సీపీ కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. 

నిన్న ఉదయం విమాన ప్రమాదం జరిగింది. రన్ వే పైకి దిగేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ తో పాటు మరో నలుగురు దుర్మరణం చెందారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం నిమిత్తం బారామతికి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.
Go Back to Shorts
Ajit Pawar
Amit Shah
Nara Lokesh
Maharashtra
Baramati
Plane crash
Funeral
Political leaders
Accident
NCP

More Telugu News