ఇండియన్ ఆర్మీపై అలియా భట్ భావోద్వేగపూరిత పోస్ట్
- భారత్, పాక్ ఉద్రిక్తతలు సద్దుమణిగిన నేపథ్యంలో బాలీవుడ్ నటి పోస్ట్
- ప్రతి యూనిఫాం వెనుక నిద్రపోని ఒక తల్లి ఉంటుందన్న అలియా
- అలియా ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు సద్దుమణిగిన నేపథ్యంలో బాలీవుడ్ నటి అలియా భట్ భారత ఆర్మీని ఉద్దేశించి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ప్రత్యేక పోస్ట్ పెట్టారు. ప్రతి యూనిఫాం వెనుక నిద్రపోని ఒక తల్లి ఉంటుందని అలియా పెట్టిన ఈ భావోద్వేగపూరిత పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
"గత కొన్ని రాత్రులు భిన్నంగా అనిపించాయి. ఒక దేశం ఊపిరి బిగబట్టినప్పుడు గాలిలో ఒకవిధమైన నిశ్శబ్దం ఉంటుంది. గత కొద్ది రోజులుగా మనం ఆ నిశ్శబ్దాన్ని అనుభవించాం. ఆ నిశ్శబ్దమైన ఆందోళన ప్రతి సంభాషణ వెనుక ఉంది, ప్రతి వార్తా వెనుక, ప్రతి భోజన బల్ల చుట్టూ ఆ నిశ్శబ్దం వినిపిస్తూనే ఉంది. ఎక్కడో పర్వతాలలో మన సైన్యం మేల్కొని, దేశకోసం మనకోసం యుద్ధం చేస్తున్నారు అనే బరువును మనం అనుభవించాం.
మనలో చాలామంది మన ఇళ్లలో నిద్రపోతుండగా, బోర్డర్లో ఉన్న ప్రజలు, సైనికులు చీకటిలో నిలబడి, తమ ప్రాణాలను అడ్డుగా పెట్టి మన నిద్రను కాపాడుతున్నారు. ఇది కేవలం ధైర్యం మాత్రమే కాదు, త్యాగం. ప్రతి యూనిఫాం వెనుక నిద్రపోని ఒక తల్లి కూడా ఉంటుంది. ఆరోజు తన బిడ్డ జోలపాటలు వినే రాత్రి కాదని, అనిశ్చితితో, ఉద్రిక్తతతో కూడిన రాత్రి అని తన తల్లికి తెలుస్తుంది" అంటూ అలియా తన ఇన్స్టా స్టోరీలో ఎమోషనల్గా రాసుకొచ్చారు.
"గత కొన్ని రాత్రులు భిన్నంగా అనిపించాయి. ఒక దేశం ఊపిరి బిగబట్టినప్పుడు గాలిలో ఒకవిధమైన నిశ్శబ్దం ఉంటుంది. గత కొద్ది రోజులుగా మనం ఆ నిశ్శబ్దాన్ని అనుభవించాం. ఆ నిశ్శబ్దమైన ఆందోళన ప్రతి సంభాషణ వెనుక ఉంది, ప్రతి వార్తా వెనుక, ప్రతి భోజన బల్ల చుట్టూ ఆ నిశ్శబ్దం వినిపిస్తూనే ఉంది. ఎక్కడో పర్వతాలలో మన సైన్యం మేల్కొని, దేశకోసం మనకోసం యుద్ధం చేస్తున్నారు అనే బరువును మనం అనుభవించాం.
మనలో చాలామంది మన ఇళ్లలో నిద్రపోతుండగా, బోర్డర్లో ఉన్న ప్రజలు, సైనికులు చీకటిలో నిలబడి, తమ ప్రాణాలను అడ్డుగా పెట్టి మన నిద్రను కాపాడుతున్నారు. ఇది కేవలం ధైర్యం మాత్రమే కాదు, త్యాగం. ప్రతి యూనిఫాం వెనుక నిద్రపోని ఒక తల్లి కూడా ఉంటుంది. ఆరోజు తన బిడ్డ జోలపాటలు వినే రాత్రి కాదని, అనిశ్చితితో, ఉద్రిక్తతతో కూడిన రాత్రి అని తన తల్లికి తెలుస్తుంది" అంటూ అలియా తన ఇన్స్టా స్టోరీలో ఎమోషనల్గా రాసుకొచ్చారు.
More Telugu News
బెంగళూరులో వాన బీభత్సం.. ఏడుగురి మృతి
![]()
పదవి వచ్చిందనే అహంకారం వద్దు: నారా లోకేష్
![]()
లండన్ ప్రేమ కథతో ఆనంద్ దేవరకొండ ‘ఎపిక్’.. టీజర్ వచ్చేసింది
![]()
కొంపదీసి తుమ్మును ఆపుతున్నారా ఏంటి? చెవులు, మెదడుకు ముప్పు తెచ్చుకోవడమే!
![]()
కవితకు 'టీఆర్ఎస్' షాక్.. పార్టీ పేరును రిజిస్టర్ చేయవద్దని ఈసీకి లేఖ!
![]()
సన్రైజర్స్తో మ్యాచ్.. టాస్ గెలిచిన ముంబై... ఇవాళ కూడా 'హిట్ మ్యాన్' లేడు!
![]()
కష్టపడితే సాధారణ కార్యకర్తకు కూడా పోలిట్ బ్యూరోలో చోటు: నారా లోకేశ్
![]()
ఎగ్జిట్ పోల్స్: బెంగాల్లో హోరాహోరీ, తమిళనాడులో డీఎంకేకు మొగ్గు, కేరళలో ఉత్కంఠ
![]()
అసోంలో బీజేపీ హవా, పుదుచ్చేరిలో ఎన్డీయే గెలుపు: ఎగ్జిట్ పోల్ సర్వేలు
![]()
ఒక లీటరు ఇంధనం కోసం 10,000 లీటర్ల నీరా? భారత ఇథనాల్ వ్యూహం బెడిసికొట్టే ప్రమాదం!
![]()
బెంగాల్లో ముగిసిన చివరి దశ పోలింగ్... మే 4న ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ
![]()
సుదీర్ఘకాలంగా కేసు.. అసహనంతో 2046కు వాయిదా వేసిన న్యాయమూర్తి!!
![]()
ఏపీలో ఒకవైపు ఎండలు, మరోవైపు వర్షాలు
![]()
సీఎస్ సాయిప్రసాద్ కుమార్తె నిశ్చితార్థానికి హాజరైన సీఎం చంద్రబాబు... ఫొటోలు ఇవిగో!
![]()
బెంగాల్లో మేం గెలుస్తున్నాం: కోల్కతాలో ఓటేసిన అనంతరం మమతా బెనర్జీ
![]()