రేవంత్ రెడ్డిని కలిసిన మంచు మోహన్ బాబు, మంచు విష్ణు

Manchu Mohan Babu and Vishnu meets Revanth Reddy
  • రేవంత్ రెడ్డికి శాలువా కప్పి సన్మానించిన సినీ నటులు
  • రేవంత్ రెడ్డితో పలు అంశాలపై చర్చించామని విష్ణు ట్వీట్
  • చిత్ర పరిశ్రమకు ఆయన చొరవ చూపుతున్నారని కితాబు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు, ఆయన తనయుడు మంచు విష్ణు కలిశారు. ముఖ్యమంత్రికి శాలువా కప్పి సన్మానించారు. ముఖ్యమంత్రితో భేటీకి సంబంధించిన ఫొటోలను మంచు విష్ణు తన 'ఎక్స్' ఖాతా వేదికగా పంచుకున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసే అవకాశం తమకు లభించిందని మంచు విష్ణు పేర్కొన్నారు. పలు ముఖ్యమైన అంశాలపై ఆయనతో చర్చించడం ఆనందంగా ఉందని రాసుకొచ్చారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఆయన చూపిన చొరవకు, నిబద్దతకు ధన్యవాదాలు అని తెలిపారు.
Go Back to Shorts
Manchu Vishnu
Mohan Babu
Revanth Reddy
Telangana
Tollywood

More Telugu News