టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు... పాలకమండలిలో తెలంగాణ నుంచి ఐదుగురికి చోటు

New TTD Chairman BR Naidu
  • 24 మంది సభ్యులతో పాలకమండలి
  • ఏపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలకు చోటు
  • తెలంగాణ నుంచి నన్నూరి నర్సిరెడ్డికి చోటు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి చైర్మన్‌గా బీఆర్ నాయుడు నియమితులయ్యారు. టీటీడీ చైర్మన్, సభ్యులను ఈరోజు సాయంత్రం టీటీడీ ప్రకటించింది. 24 మంది సభ్యులతో పాలకమండలిని ప్రకటించింది. టీటీడీలో తెలంగాణ నుంచి ఐదుగురికి చోటు దక్కింది. ఏపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలకు చోటు దక్కింది.

టీటీడీ బోర్డు సభ్యులు...  జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట ఎమ్మెల్యే), వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి (కోవూరు ఎమ్మెల్యే), ఎంఎస్ రాజు (మడకశిర ఎమ్మెల్యే), పనబాక లక్ష్మి (కేంద్ర మాజీ మంత్రి), జాస్తి పూర్ణ సాంబశివరావు, నన్నూరి నర్సిరెడ్డి (తెలంగాణ), శ్రీ సదాశివరావు నన్నపనేని, కృష్ణమూర్తి (తమిళనాడు), కోటేశ్వరరావు, మల్లెల రాజశేఖర్ గౌడ్, జంగా కృష్ణమూర్తి, దర్శన్ ఆర్ఎన్ (కర్ణాటక), జస్టిస్ హెచ్‌ఎల్ దత్ (కర్ణాటక), శాంతారామ్, పి.రామ్మూర్తి (తమిళనాడు), జానకీ దేవి తమ్మిశెట్టి, బూంగునూరు మహేందర్ రెడ్డి (తెలంగాణ), అనుగోలు రంగశ్రీ (తెలంగాణ), బూరగాపు ఆనందసాయి (తెలంగాణ), సుచిత్ర ఎల్ల (తెలంగాణ), నరేశ్ కుమార్ (కర్ణాటక), డా.ఆదిత్ దేశాయ్ (గుజరాత్), శ్రీసౌరభ్ హెచ్ బోరా (మహారాష్ట్ర).
Go Back to Shorts
TTD
Telangana
Andhra Pradesh
BR Naidu

More Telugu News