వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు చెందిన స్థలాల్లో సోదాలపై ఈడీ ప్రకటన

ED release statement on raids over former MP MVV Sathyanarayana delongings
  • ఇటీవల విశాఖలో మాజీ ఎంపీ ఎంవీవీకి చెందిన స్థలాల్లో ఈడీ సోదాలు
  • ఐదు ప్రదేశాల్లో సోదాలు నిర్వహించామన్న ఈడీ
  • రూ.200 కోట్ల విలువైన 12.51 ఎకరాలు అన్యాక్రాంతం కావడంపై వివరణ
ఇటీవల విశాఖలో వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు చెందిన స్థలాల్లో ఈడీ దాడులు చేపట్టడం తెలిసిందే. ఈ సోదాలపై ఈడీ నేడు ప్రకటన చేసింది. అక్టోబరు 19వ తేదీన విశాఖలోని ఐదు ప్రదేశాల్లో సోదాలు నిర్వహించామని వెల్లడించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం ఉల్లంఘనలపై ఈ సోదాలు చేపట్టినట్టు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్  వివరించింది. 

రూ.200 కోట్ల విలువైన 12.51 ఎకరాలు అన్యాక్రాంతం కావడంపై దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొంది. వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాల కోసం ప్రభుత్వం భూమిని కేటాయించిందని, ఆ భూమిని మోసపూరితంగా అన్యాక్రాంతం చేశారని ఈడీ వివరించింది. అరిలోవ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించింది.
Go Back to Shorts
MVV Satyanarayana
ED Raids
Visakhapatnam
YSRCP
Andhra Pradesh

More Telugu News