రేవంత్ రెడ్డి పిచ్చోడిలా మాట్లాడుతున్నాడు: రాజయ్య తీవ్ర వ్యాఖ్యలు

Rajaiah shocking comments on Revanth Reddy
  • రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదని ఎద్దేవా
  • హైదరాబాద్‌కు మూడు వైపులా సముద్రం ఉందనడం విడ్డూరమని వ్యాఖ్య
  • తెలంగాణలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని విమర్శ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత, స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పిచ్చిపట్టిన వ్యక్తిలా మాట్లాడుతున్నారని, ఆయన మాట్లాడేది ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ... సీఎం అజ్ఞానిలా మాట్లాడుతున్నారన్నారు. దిల్‌సుఖ్ నగర్‌లో విమానాలు కొనడానికి దొరుకుతున్నాయని ఒకసారి అంటారని, హైదరాబాద్‌‌కు మూడు వైపులా సముద్రం ఉంటుందని మరోసారి అంటారని ఎద్దేవా చేశారు. 

తెలంగాణలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందన్నారు. ఆయన తెలివి ఉండి మాట్లాడుతున్నారా? తెలివి లేక మాట్లాడుతున్నారా? అని విమర్శించారు. పాలనపై పట్టులేక పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా దాటవేత ధోరణి అవలంభిస్తున్నారని వ్యాఖ్యానించారు.

Go Back to Shorts
Revanth Reddy
Congress
BRS
Rajaiah

More Telugu News