ఉమ్మడి నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల్లో 48 గంటల పాటు వైన్ షాపులు, బార్లు మూసివేత

Wine shops closed in warangal khammam and nalgonda from tomorrow
  • గ్రాడ్యుయేట్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎక్సైజ్ శాఖకు పోలీసు అధికారుల ఆదేశాలు
  • రేపు సాయంత్రం 4 నుంచి 27 సాయంత్రం 4 గంటల వరకు దుకాణాల బంద్
  • 27న గ్రాడ్యుయేట్స్ ఉప ఎన్నికలకు పోలింగ్
ఉమ్మడి నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. 48 గంటల పాటు వైన్ షాపులు, బార్లు మూసివేయాలని ఆదేశించారు. అయితే పోలింగ్ జరిగే మూడు ఉమ్మడి జిల్లాల్లో ఈ దుకాణాలు బంద్ చేయనున్నారు. మే 27న పోలింగ్ ఉంది. దీంతో రేపు సాయంత్రం 4 గంటల నుంచి 27 సాయంత్రం సాయంత్రం 4 గంటల వరకు వైన్ షాపులు, బార్లు మూతపడనున్నాయి. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. 4,61,806 పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు.
Go Back to Shorts
Election Commission
Graduate MLC Elections
Telangana

More Telugu News