టెర్రరిస్ట్ సంస్థలన్నీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించాయి: ధర్మపురి అర్వింద్

MP Arvind shocking comments on Congress
  • కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశం తీవ్రవాదుల చేతుల్లోకి వెళుతుందని హెచ్చరిక
  • ముస్లింలంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని సిమి టెర్రరిస్ట్ సంస్థ ప్రకటించిందన్న ఎంపీ
  • ఎన్నికలు బీజేపీకి, టెర్రరిస్టులకు మధ్య జరుగుతున్నాయా? అనే సందేహం కలుగుతోందని వ్యాఖ్య
లోక్ సభ ఎన్నికల్లో టెర్రరిస్ట్ సంస్థలన్నీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించాయని... ఆ పార్టీ కనుక అధికారంలోకి వస్తే దేశం ఉగ్రవాదుల చేతుల్లోకి వెళుతుందని నిజామాబాద్ ఎంపీ, బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ... ముస్లింలంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని సిమి టెర్రరిస్ట్ సంస్థ ప్రకటించిందన్నారు. ఈ ఎన్నికలు బీజేపీకి, టెర్రరిస్టులకు మధ్య జరుగుతున్నాయా? అనే సందేహం కలుగుతోందన్నారు.

నిషేధిత సిమిపై 15 తీవ్రవాద కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. పీఎఫ్ఐ, సిమికి కాంగ్రెస్ మాతృసంస్థగా మారిందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ రెండు సంస్థలు కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ చేస్తున్నాయన్నారు. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రభుత్వాన్ని ఆ సంస్థలే కంట్రోల్‌ చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. జగిత్యాల పీఎఫ్‌ఐకి అడ్డాగా, బోధన్ నకిలీ పాస్‌పోర్టులకు అడ్డాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Dharmapuri Arvind
BJP
Congress
Lok Sabha Polls

More Telugu News