ముగిసిన ఏపీ క్యాబినెట్ సమావేశం... కీలక నిర్ణయాలు ఇవిగో!

AP Cabinet takes key decisions
  • సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ సమావేశం
  • 4 గంటలకు పైగా సాగిన భేటీ
  • రాష్ట్రంలో సమగ్ర కులగణనకు క్యాబినెట్ నిర్ణయం
  • టెన్నిస్ ఆటగాడు సాకేత్ మైనేనికి గ్రూప్-1 ఉద్యోగం
సీఎం జగన్ అధ్యక్షతన సుదీర్ఘ సమయం పాటు జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ముగిసింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ మంత్రివర్గ భేటీ 4 గంటలకు పైగా సాగింది. ఏపీ సచివాలయం మొదటి బ్లాక్ లో ఈ సమావేశం జరిగింది. ఈ క్యాబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

ప్రధానంగా ఏపీలో సమగ్ర కులగణనపై ఈ సమావేశంలో చర్చించారు. కులగణన చేపట్టేందుకు సీఎం సహా మంత్రులందరూ సానుకూలంగా స్పందించారు. నవంబరు 15 నుంచి రాష్ట్రంలో కులగణన చేపట్టాలని నిర్ణయించారు. అంతేకాదు, టెన్నిస్ ఆటగాడు సాకేత్ మైనేనికి గ్రూప్-1 ఉద్యోగం ఇవ్వాలన్న ప్రతిపాదనకు ఆమోదం లభించింది.

క్యాబినెట్ భేటీలో ఇంకా ఏ నిర్ణయాలు తీసుకున్నారంటే...

  • ఏపీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ. ప్రతి జర్నలిస్టుకు 3 సెంట్ల స్థలం. 
  • ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఆర్డర్ డ్రాఫ్ట్-2023కు ఆమోదం
  • జగనన్న సురక్ష కార్యక్రమానికి ఆమోదం. నవంబరు 15 నుంచి డిసెంబరు 15 వరకు ఆరోగ్యశ్రీపై అవగాహన కార్యక్రమం
  • ఆర్ అండ్ బి డిపార్ట్ మెంట్ లో 467 ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీ
  • 6,790 పాఠశాలల్లో భవిష్యత్ నైపుణ్యాలపై బోధన
  • ఫెర్రో అల్లాయ్ పరిశ్రమలకు విద్యుత్ చార్జీల మినహాయింపు
  • వ్యవసాయ సహకార శాఖకు రూ.5 వేల కోట్లకు గ్యారెంటీతో మార్క్ ఫెడ్ ద్వారా రుణం
  • పోలవరం నిర్వాసితుల ఇళ్ల పట్టాలు, స్థలాల రిజిస్ట్రేషన్లకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ రుసుం, యూజర్ చార్జీల మినహాయింపు నిర్ణయాన్ని ర్యాటిఫై చేసిన ప్రభుత్వం.

Go Back to Shorts
AP Cabinet
CM Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News