ఆసియా కప్ కు తేదీల ఖరారు... టోర్నీ ఎక్కడ జరుగుతుందంటే...!

Asia Cup dates and hosts confirmed
  • అనిశ్చితికి తెరదించిన ఆసియా క్రికెట్ కౌన్సిల్
  • ఆగస్టు 31 నుంచి ఆసియా కప్.. సెప్టెంబరు 17న ఫైనల్
  • ఆసియా కప్ కు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న పాకిస్థాన్, శ్రీలంక 
  • నాలుగు మ్యాచ్ లకు పాక్ ఆతిథ్యం... మిగిలిన మ్యాచ్ లన్నీ శ్రీలంకలో!
  • ఒకే గ్రూపులో భారత్, పాకిస్థాన్
భారత్, పాకిస్థాన్ మధ్య రాజకీయ వైరం కారణంగా ఈ ఏడాది ఆసియా కప్ వేదికపై అనిశ్చితి ఏర్పడింది. అయితే, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఆ అనిశ్చితికి తెరదించింది. టోర్నీలో 4 మ్యాచ్ లకు పాకిస్థాన్ ఆతిథ్యమిస్తుందని, మిగిలిన అన్ని మ్యాచ్ లు శ్రీలంకలో జరుగుతాయని ఏసీసీ పేర్కొంది. 

ఇక టోర్నీ తేదీలు కూడా ఖరారయ్యాయి. పాకిస్థాన్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ ప్రాంతీయ టోర్నీ ఆగస్టు 31న ప్రారంభం కానుంది. సెప్టెంబరు 17న జరిగే ఫైనల్ తో ఆసియా కప్ టోర్నీ ముగుస్తుంది. 

కాగా, ఈ 16వ ఆసియా కప్ టోర్నీలో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, నేపాల్ జట్లు పోటీపడనున్నాయి. టోర్నీలో భాగంగా 13 వన్డే మ్యాచ్ లు నిర్వహించనున్నారు. 

టోర్నీ తొలి దశలో మొత్తం 6 జట్లను రెండు గ్రూపులుగా విభజించనున్నారు. రెండు గ్రూపుల్లో టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-4 దశకు చేరుకుంటాయి. సూపర్-4 దశలో ఈ నాలుగు జట్లలో టాప్-2లో నిలిచే జట్లు ఫైనల్ కు అర్హత సాధిస్తాయి. 

భారత్, పాకిస్థాన్, నేపాల్ ఒక గ్రూపులో ఉండగా.... శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ మరో గ్రూపులో ఉన్నాయి.
Go Back to Shorts
Asia Cup
Host
Pakistan
Sri Lanka
India
ACC
Cricket

More Telugu News