నలుగురు పిల్లల్ని చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి

Rajasthan Woman allegedly kills her four children and committed suicide
  • రాజస్థాన్‌లోని బార్మెర్ జిల్లాలో ఘటన
  • పిల్లల్ని స్టీలు డ్రమ్ములో దించి తాళం వేసిన తల్లి
  • ఊపిరి ఆడక మృతి
  • భార్యాభర్తల మధ్య గొడవే కారణమని అనుమానం
రాజస్థాన్‌లోని బార్మెర్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ తల్లి తన నలుగురు చిన్నారులను చంపి ఆత్మహత్య చేసుకుంది. చిన్నారుల్లో ముగ్గురు అమ్మాయిలు కాగా, ఒకరు బాలుడు. ఓ స్టీల్ డమ్ములో పిల్లల్ని దించి తాళం వేయడంతో వారు ఊపిరి ఆడక చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.  

 27 ఏళ్ల నిందితురాలి భర్త మైనింగ్ కార్మికుడని, అతడు విధులకు వెళ్లిన తర్వాత ఈ ఘటన జరిగిందని తెలిపారు. భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని, పిల్లలను ఆమె చంపేందుకు ఇదే కారణం అయి ఉండొచ్చని స్థానికులు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Rajasthan
Crime News
Mother Kills Children

More Telugu News