తిరుమలలో బాగా తగ్గిన భక్తుల రద్దీ

Rush in Tirumala normalized
  • కొన్నిరోజుల కిందట తిరుమలలో విపరీతమైన రద్దీ
  • ప్రస్తుతం సాధారణ పరిస్థితులు
  • 4 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు
  • శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం
ఇటీవల భక్తుల తాకిడితో కిటకిటలాడిన తిరుమల పుణ్యక్షేత్రంలో ప్రస్తుతం రద్దీ సాధారణ స్థితికి చేరుకుంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు 4 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 84,539 మంది భక్తులు దర్శించుకున్నారు. 

నిన్న ఒక్కరోజే వెంకటేశ్వరస్వామి హుండీ ఆదాయం రూ.3.72 కోట్లు లభించింది. 39,812 మంది భక్తులు తలనీలాల మొక్కు సమర్పించుకున్నారు.
Go Back to Shorts
Tirumala
Devotees
Lord Venkateswara
TTD

More Telugu News