నోరు మూసుకో... రైతును కసురుకున్న మంత్రి కారుమూరి

Minister Karumuri fires on a farmer
  • ఓ రైతును ఎర్రి పప్ప అని పిలిచిన మంత్రి
  • తాజాగా మరో రైతుపై ఆగ్రహం
  • ఏం కావాలి నీకు అంటూ గద్దించిన వైనం
ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఓ రైతును ఎర్రి పప్ప అని పిలవడం తెలిసిందే. ఆ ఘటన మరువకముందే ఆయన మరో రైతుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏయ్ నోరు మూసుకో అంటూ కసురుకున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోగా, తడిసిన ధాన్యాన్ని పరిశీలించేందుకు మంత్రి కారుమూరి ఏలూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఓ రైతు సమస్యలు చెప్పుకుంటుండగా, మంత్రిలో అసహనం కట్టలు తెంచుకుంది. ఏం కావాలి నీకు... అంటూ గద్దించారు. వీడియో చిత్రీకరిస్తున్న విలేకరులను కూడా రికార్డింగ్ ఆపాలని మంత్రి సూచించారు. దీనికి సంబంధించి వీడియో సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది.
Go Back to Shorts
Karumuri Nageswara Rao
Minister
Farmer
YSRCP
Eluru District

More Telugu News