ఇండోర్ పిచ్ పై తీవ్రంగా స్పందించిన ఐసీసీ

ICC terms Indore pitch Poor
  • మూడో రోజు ఉదయానికే ముగిసిన మ్యాచ్
  • టీమిండియాను 9 వికెట్ల తేడాతో ఓడించిన ఆసీస్
  • పిచ్ పై మ్యాచ్ రిఫరీ నివేదిక
  • తమ అభిప్రాయాలు వెల్లడించిన రోహిత్ శర్మ, స్టీవ్ స్మిత్
  • నాసిరకం పిచ్ అంటూ తీర్పు ఇచ్చిన ఐసీసీ
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు కోసం ఇండోర్ హోల్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పిచ్ పై ఐసీసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మ్యాచ్ మూడో రోజు ఉదయమే ముగియడంతో పిచ్ పై విమర్శలు వెల్లువెత్తాయి. 

ఈ నేపథ్యంలో మ్యాచ్ ముగిసిన అనంతరం రిఫరీ క్రిస్ బ్రాడ్ ఐసీసీకి నివేదిక సమర్పించారు. ఇరుజట్ల కెప్టెన్లు రోహిత్ శర్మ, స్టీవ్ స్మిత్ ల అభిప్రాయాలను కూడా ఆ నివేదికలో పొందుపరిచారు. నివేదిక పరిశీలించిన ఐసీసీ... ఇండోర్ పిచ్ ను నాసిరకం పిచ్ గా పేర్కొంది. అంతేకాదు, ఈ మైదానానికి 3 డీమెరిట్ పాయింట్లను కూడా విధించింది. కాగా, ఐసీసీ నిర్ణయంపై అప్పీల్ చేసుకునేందుకు బీసీసీఐకి 14 రోజుల గడువు లభించింది. 

ఇండోర్ పిచ్ పై బ్యాటింగ్ చేసేందుకు ఇరుజట్ల ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. తొలి రోజే 14 వికెట్లు పతనం అయ్యాయి. ఈ మ్యాచ్ మొత్తమ్మీద 31 వికెట్లు పడగా, అందులో 26 వికెట్లు స్పిన్నర్లకే దక్కాయంటే పిచ్ పై బంతి ఎలా టర్న్ అయిందో చెప్పవచ్చు.
Go Back to Shorts
Indore Pitch
Poor
ICC
Team India
Australia

More Telugu News