మల్లారెడ్డికి ఐటీ నోటీసులు.. సోదాల్లో ఎవరి వద్ద ఎంత నగదు దొరికిందంటే..!

IT notices to minister Malla Reddy
  • మల్లారెడ్డి, ఆయన బంధువుల ఇళ్లలో ఐటీ మెరుపుదాడులు
  • భారీ మొత్తంలో నగదు స్వాధీనం
  • విచారణకు హాజరు కావాలంటూ మల్లారెడ్డి, ఆయన కుమారులు, అల్లుడికి నోటీసులు
తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి, ఆయన బంధువుల ఇళ్లు, కార్యాలయాలపై నిర్వహించిన ఐటీ దాడులు ముగిశాయి. సోమవారం నాడు తమ విచారణకు హాజరుకావాలంటూ మల్లారెడ్డి సహా, ఆయన కుమారులు, అల్లుడికి ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఇప్పటి వరకు పెద్ద మొత్తంలో నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

ఐటీ దాడుల్లో ఎవరెవరి వద్ద ఎంత నగదును స్వాధీనం చేసుకున్నారంటే.. 
  • మల్లారెడ్డి నివాసంలో - రూ. 6 లక్షలు
  • మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డి నివాసంలో - రూ. 12 లక్షలు
  • మల్లారెడ్డి చిన్న కుమారుడు భద్రారెడ్డి నివాసంలో - రూ. 6 లక్షలు
  • మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి నివాసంలో - రూ. 3 కోట్లు
  • ప్రవీణ్ రెడ్డి ఇంట్లో - రూ. 1.5 కోట్లు 
  • త్రిశూల్ రెడ్డి నివాసంలో - రూ. 2 కోట్లు
  • రఘునందన్ రెడ్డి నివాసంలో - రూ. 2 కోట్లు
  • ప్రవీణ్ కుమార్ నివాసంలో - రూ. 2.5 కోట్లు
  • సుధీర్ రెడ్డి నివాసంలో - రూ. కోటి
Go Back to Shorts
Ch Malla Reddy
IT Raids
Notices

More Telugu News