పొత్తుల దిశ‌గా చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌పై జ‌న‌సేన నేత నాదెండ్ల స్పంద‌న ఇదే

nadendla manohar response on chandrababu comments
  • ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల‌కుండా చూడ‌ట‌మే మా ల‌క్ష్యమన్న నాదెండ్ల 
  • టీడీపీతో పొత్తు విష‌యాన్ని పవ‌న్ క‌ల్యాణ్ నిర్ణ‌యిస్తారని వ్యాఖ్య 
  • బీజేపీతో స‌త్సంబంధాలున్నాయ‌న్న నాదెండ్ల‌
2024 ఎన్నికల‌కు సంబంధించి ఏపీలో అధికార వైసీపీకి వ్య‌తిరేకంగా అన్ని పార్టీలు ఏకం కావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, ఆ దిశ‌గా స‌మష్టి ఉద్య‌మం జ‌ర‌గాల్సి ఉందని, ఆ ఉద్య‌మానికి టీడీపీ నాయ‌క‌త్వం వ‌హిస్తుంద‌ని ఆ పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు శుక్ర‌వారం కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌పై జ‌న‌సేన చాలా వేగంగానే స్పందించింది. ఈ మేర‌కు శుక్ర‌వారం క‌ర్నూలు జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న జ‌న‌సేన రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ స్పందించారు. 

ఈ విషయంపై నాదెండ్ల మ‌నోహ‌ర్ మాట్లాడుతూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వ ఓటు చీల‌కుండా చూడ‌ట‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని చెప్పారు. ఇప్ప‌టికే దీనిపై ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేశార‌ని కూడా ఆయ‌న పేర్కొన్నారు. టీడీపీతో పొత్తు విష‌యాన్ని ప‌వ‌న్ క‌ల్యాణ్ నిర్ణ‌యిస్తార‌ని నాదెండ్ల చెప్పారు. ప్ర‌స్తుతం బీజేపీతో త‌మ పార్టీకి స‌త్సంబంధాలు కొన‌సాగుతున్నాయ‌ని నాదెండ్ల తెలిపారు.
Go Back to Shorts
Janasena
Nadendla Manohar
TDP
Chandrababu

More Telugu News